భార్యా,భర్తల గొడవ కారణం గా.. పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి..
1 min read
భార్యా,భర్తల గొడవ కారణం గా.. పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి..
వరంగల్ : జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఏడు నెలల తన పసికందును వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు ప్రయత్నించింది.. భార్యా భర్తల మధ్య గొడవ కారణంగా అభం శుభం తెలియని ఓ చిన్నారిని అమ్మకానికి పెట్టింది భార్య.. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. అయితే, పాప ఆరోగ్యం బాగోలేక ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చానని ఆమె చెబుతోంది.. దర్యాప్తు అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారులకు పాపను అప్పగించారు పోలీసులు.